Thursday, April 18, 2024
Home వార్తలు ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

- Advertisement -

ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్నాయి. కీలక నిర్ణయాల సమయంలో న్యాయ సలహా తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. తరచు ఏపి హైకోర్టు..పలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను ఏపి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సీనియర్ రెసిడెన్సి పోస్టుల భర్తీ నియామకానికి ప్రైవేటు కళాశాల విద్యర్ధులను అనుమతించకపోవడంపై హైకోర్టును కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణి తదితరులు ఆశ్రయించారు.

- Advertisement -

ఈ పిటిషన్లను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారించారు. పిటిషన్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులు మాత్రమే ఈ పోస్టు నియామకానికి అనుమతించడం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబందనలకు వ్యతిరేకమని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ సీనియర్ రెసిడెన్సి పోస్టుకు అర్హులేనని న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. సదరు  నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

- Advertisement -
RELATED ARTICLES

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3...

Most Popular

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3...

కాకమ్మ కబుర్లు చెబుతున్నారు : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని గూగుల్ టేక్ ఔట్ ఇతర అన్ని సాక్ష్యాలు చెబుతున్నపట్టకి…హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి...