Friday, April 19, 2024
Home విశ్లేషణ Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

- Advertisement -

Sachivalaya Posts: నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది..! ఒకరకంగా ఏపీ ప్రభుత్వానికి రాజకీయంగానూ సవాలుగా మారింది.. కొన్ని చోట్ల అవకాశాలు లేక.. ఉన్నా అందిపుచ్చుకోలేక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు..! కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అవకాశాలు ఉన్నప్పటికీ.., ఖాళీలు ఉన్నప్పటికీ.. భర్తీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ.., అన్ని అర్హతలు సాధించి వేచి చూస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పోస్టుల భర్తీ జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వడంతో పాటూ.., సాధారణ ప్రజలకు సేవలను సులభతరం చేసింది. ఈ విభాగంలో జిల్లాలో 1, 2, 3 క్యాటగిరిలో ఉన్న ఖాళీలలను భర్తీ చేయడం లేదు. నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.. దీంతో అన్ని అర్హతలు సాధించిన నిరుద్యోగులు నష్టపోతున్నారు..!

Sachivalaya Posts: As per June List

Sachivalaya Posts: మొత్తం 100 పోస్టుల ఖాళీలు..!!

సచివాలయ క్యాటగిరి 1, 2, 3 లో స్లేయిడింగ్, నాన్ జాయినింగ్ పోస్టులు 27 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబరులోనే రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్టుకి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి, ధ్రువపత్రాల పరిశీలనా కూడా పూర్తి చేశారు. స్లేయిడింగ్ ప్రక్రియ దగ్గర నిలిపి వేశారు. దీని ప్రకారం ఒక అభ్యర్థి ఏదైనా 2, 3 ఉద్యోగులాలకు ఎంపికైనప్పటికీ ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు. 2019 లో జరిగిన మొదటి దశలో ఇలా ఎంపికలు పూర్తి చేశారు. కానీ 2020 నవంబర్ నాటి ప్రక్రియను మాత్రం పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిలో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా.., డిజిటల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. మిగిలినవి పట్టించుకోలేదు.

  • సచివాలయంలో సుమారుగా 100 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ 5, మహిళా కానిస్టేబుల్ 27, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ 30, వార్డు ప్లానింగ్ 7, ఇలా దాదాపు 19 రకాల విభాగాల్లో సుమారుగా 100 ఖాళీలున్నట్టు ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు మార్లు జిల్లా కలెక్టర్, జేసీలను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని అర్హతలు సాధించి కూడా పోస్టులను భర్తీ చేయకపోవడం తమకు అన్యాయం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...