Friday, April 19, 2024
Home విశ్లేషణ Ongole RIMS: దిక్కులేని రిమ్స్.. పేదలు వెళ్తే మరణమే శరణమా..!?

Ongole RIMS: దిక్కులేని రిమ్స్.. పేదలు వెళ్తే మరణమే శరణమా..!?

- Advertisement -

Ongole RIMS: పేరు వింటే పెద్ద బ్రాండ్.. పనితీరు చూస్తే పేదలకు కూడా పని చేయదు.. దీన్నే పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకోవచ్చు..! ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి ఇదే కోవలోకి వస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం.., అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది అలసత్వం.. అన్నిటికీ తోడు వసతులు లేమి, మందులు లేకపోవడం… ఇన్ని సమస్యల మధ్య పేదల ఆసుపత్రి పెద్ద జబ్బుతో కూరుకుపోయింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ప్రభుత్వాసుపత్రి ఉంది, వెళ్లి రోగం నయం చేయించుకోవచ్చు అనే ధీమా ఉండడం లేదు. స్కానింగులు బయటే, పరీక్షలు బయటే, చివరికి మందులు కూడా బయట కొనుక్కోవాల్సిందే. లేకపోతే అక్కడే పడి చావాల్సిందే.. ఇదే ఒంగోలు రిమ్స్ లో దారుణ పరిస్థితి..!!

Ongole RIMS: మరణాలు బయటకు రానివి ఎన్నో..!?

కరోనా సందర్భంగా జిల్లాలో పెద్ద భరోసా ఇచ్చింది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి మాత్రమే. వేలాది రోగులకు వైద్యం అందించింది. కానీ కొన్ని నెలల నుండి రిమ్స్ లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. సైలెంట్ గా పాదులను దాటుతున్నాయి. మీడియా కంట పడకుండా.. లెక్కలు లేకుండా కరోనా అందరూ మర్చిపోతుండడంతో.. మరణాలు కూడా మర్చిపోవాల్సిన దుస్థితికి వచ్చేసింది.. మందులు, వైద్య సదుపాయాలూ అందుబాటులో లేక వైద్యులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. కొన్ని రోజుల నుండి మరణాలు పెరుగుతున్నాయి.

Ongole RIMS: No Medicines No Treatment

కనీస మందులు లేవట..!

- Advertisement -

మోనోసెఫ్ అనేది ఒక యాంటీ బియోటెక్.. టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలకు వాడతారు. ఆ మందుతో మాత్రమే ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. Meropenem అనే ఇంజక్షన్, Piperacillin tazobactum అనే మందు లేకపోవడంతో అందుబాటులో ఉన్న మందులతో ఏదో నెట్టుకొస్తున్నారు. కరోనా బాగా ముదిరితే రక్తం గడ్డ కడుతుంది. దీని నివారణకు lupinox అనే ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేదు. levofuxin iv కూడా ఉండదు. కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తున్నప్పటికీ దాని వలన షుగర్ పెరుగుతుంది. దీని నివారణ, నియంత్రణకు అవసరమయ్యే కిట్, కొన్ని మందులు బయట కొనుక్కుంటేనే పని.. లేకపోతే అంతే సంగతులు.. రోగి ఆసుపత్రిలో చేరిన రోజున, లేదా తర్వాత రోజున వైద్య పరీక్షలు చేస్తారు.. ఆ రిపోర్ట్ వచ్చే సరికి కనీసం వారం, పది రోజులు పడుతుంది.. ఈ లోగా ఏ రిపోర్ట్ చూసి, వైద్యం అందిస్తారో అక్కడి వైద్యులకే తెలియాలి. బయటకు చెప్పలేక, మింగలేక వైద్యులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మెడికల్ రిపోర్ట్ త్వరగా కావాలన్నా.. మందులు కొన్ని కావాలన్నా పెద్ద స్థాయి రికమెండేషన్ ఉండాలి. లేదా చేతిలో నోట్ల కట్ట ఉండాలి.

అంతర్గత అవినీతి బోలెడు..!!

- Advertisement -

ఇక రిమ్స్ లో అంతర్గత అవినీతికి అంతే లేదు. స్కానింగ్ పరికరాలు ఉన్నప్పటికీ.. బయటకు పంపిస్తారు. మందులు ఉన్నప్పటికీ.. బయటకు కొన్ని తెచ్చుకోవాలని ఫలానా అడ్రెస్ చెప్పి పంపిస్తారు. వీటి అన్నిటికీ మించి భోజన సరఫరా అయితే నాసిరకం. ప్రభుత్వం ఇచ్చే నగదుకు, వీళ్ళు అందించే నగదుకు సంబంధం ఉండదు. అయితే రాజకీయ సిఫార్సులతో ఈ కాంట్రాక్టర్ రాజకీయ భజనలు చేసుకుంటూ.., పెదాలతో ఆడుకుంటున్నారు. కరోనా రెండోదశ కొందరు నాయకుల పేరిట ఏర్పాటైన సేవా కేంద్రాలు కూడా అనధికార స్పాన్సర్ ఈ భోజన కాంట్రాక్టర్లేనని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలా నాయకుల ఆశీస్సులతో అవినీతి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి..

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...