Thursday, April 25, 2024
Home విశ్లేషణ Mandali Budda Prasad: జగన్ సర్కార్‌కు మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

Mandali Budda Prasad: జగన్ సర్కార్‌కు మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

- Advertisement -

Mandali Budda Prasad: జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల తెలుగు అకాడమి పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డికి  ఆయన లేఖ రాశారు. అకాడమి పేరు మార్చడంపై ప్రజాబిప్రాయం ఎలా ఉందో ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయనీ, సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వివరించారు.

- Advertisement -

సంస్కృత భాషాబివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదనీ, అందు కోసం ప్రత్యేకంగా అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. తమ మాటలను ఎదుటి వారు వినాలని కోరుకునే వారు ఇతరుల మాటలను గౌరవించాలనీ, ఇది ప్రజాస్వామ్య మూలసూత్రమని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందే తప్ప నష్టమేమీ ఉండదని మండలి బుద్దప్రసాద్ అన్నారు.

- Advertisement -

తెలుగు అకాడమి పేరు మార్పును తెలుగు – సంస్కృత అకాడమి అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా ఎవరూ సమర్ధించడం లేదని అన్నారు.

- Advertisement -

తెలుగు అకాడమి పేరు మార్చడంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. మంత్రులు పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ఈ అంశంపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...